అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ (ఏఎస్ఎంఈ) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ మెకానికల్ ఇంజినీరింగ్ కాంగ్రెస్ అండ్ ఎక్స్పోజిషన్ (ఐఎంఈసిఈ) తొలి భారత ఎడిషన్ 2025 సెప్టెంబర్ 10న హైదరాబాద్లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ మహాసభ సెప్టెంబర్ 10 నుండి 13 వరకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది.
సాధరణంగా ఏఎస్ఎంఈ, ఐఎంఈసిఈ ను ప్రతీ సంవత్సరం అమెరికాలో నిర్వహిస్తుంది. కానీ తొలిసారి అమెరికా అవతల భారత్ లో హైదరాబాద్ లో నిర్వహించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తలు, విద్యావేత్తలు, పరిశ్రమల నేతలు మరియు ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొననున్నారు. కీనోట్ స్పీకర్లలో డా. బాబాసాహెబ్ కళ్యాణి, మేనేజింగ్ డైరెక్టర్ – భారత్ ఫోర్జ్ గ్రూప్; శ్రీ టామ్ కోస్టాబైల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ – ఏఎస్ఎంఈ; డా. లెస్టర్ కె. సు, అధ్యక్షుడు –ఏఎస్ఎంఈ (2025–2026); డా. కళైసెల్వి ఎన్., డైరెక్టర్ జనరల్ – సిఎస్ఐఆర్ & సెక్రటరీ – డిఎస్ఐఆర్; మరియు శ్రీ పవన్ కుమార్ చందన, ఫౌండర్ – స్కైరూట్ ఏరోస్పేస్ వంటి ప్రముఖులు ఉన్నారు.
అదేవిధంగా శ్రీమతి సుసాన్ ఇప్రి-బ్రౌన్ (గత అధ్యక్షురాలు – ఏఎస్ఎంఈ), డా. యోగి గోస్వామి (ప్రొఫెసర్ – యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా), డా. జితేంద్ర శర్మ (ఎండీ & సీఈఓ – ఏఎంటిజెడ్), శ్రీ శివకుమార్ కల్యాణరామన్ (సీఈఓ – ఏయన్ఆర్ఎఫ్), డా. కనకసభాపతి సుబ్రహ్మణియన్ (సీనియర్ వైస్ ప్రెసిడెంట్ – అశోక్ లేలాండ్ లిమిటెడ్ & కాంగ్రెస్ చైర్ – ఐఎంఈసిఈ ఇండియా 2025), డా. మహంతేశ్ హిరేమత్ (మాజీ అధ్యక్షుడు – ఏఎస్ఎంఈ), శ్రీమతి స్టెఫనీ వియోలా (మేనేజింగ్ డైరెక్టర్ – ఏఎస్ఎంఈ ఫౌండేషన్), శ్రీ సౌమేంద్ర బెనర్జీ (డైరెక్టర్ – హనీవెల్ యూఓపి ఇండియా), డా. జోసెలిన్ గాడిన్ (వైస్ ప్రెసిడెంట్ & హెడ్ ఆఫ్ ఇంజనీరింగ్ – ఎయిర్బస్ ఇండియా), డా. ఎన్. శరవణన్ (సిటివో – అశోక్ లేలాండ్ లిమిటెడ్), డా. అంషుమన్ అవస్థి (సీనియర్ వైస్ ప్రెసిడెంట్ – మెర్సిడెస్ బెంజ్ ఆర్&డి ఇండియా), డా. ప్రదీప్ సలపక్కం (హెడ్ – ఇండస్ట్రీ సొల్యూషన్స్ & కస్టమర్ ఇంపాక్ట్ – ఆర్టిక్యుల8) తదితరులు ప్రసంగించనున్నారు.
ఈ కాంగ్రెస్ ద్వారా ఇంజినీరింగ్ రంగంలో అంతరశాఖల సహకారం, జ్ఞాన వినిమయం, ఆవిష్కరణలు మరియు ఆలోచనా నాయకత్వానికి ఏఎస్ఎంఈ ఐఎంఈసిఈ వేదికగా నిలవనుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 1,500 మంది ప్రముఖ ఆవిష్కర్తలు, విద్యా నిపుణులు, పరిశ్రమల నేతలు మరియు ప్రభుత్వ ప్రతినిధులు ఈ తొలి భారత ఎడిషన్లో పాల్గొనడానికి హైదరాబాద్లో చేరుకోనున్నారు.